ఇరు జిల్లాల్లో 26 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-02-23T05:52:26+05:30 IST
ఇరు జిల్లాల్లో 26 కరోనా కేసులు
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, ఫిబ్రవరి 22: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 26కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 2,275మందికి పరీక్షలు నిర్వహించగా 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,051 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో మంగళవారం ఎవరూ చేరలేదు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 11మంది చికిత్స పొందుతున్నారు. 309 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.