ఇరు జిల్లాల్లో 12 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-03-04T05:55:10+05:30 IST
ఇరు జిల్లాల్లో 12 కరోనా కేసులు
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, మార్చి 3: ఉమ్మడి జిల్లాలో గురువారం 12కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 1,806మందికి పరీక్షలు నిర్వహించగా 9, భద్రాద్రి జిల్లాలో 484మందికి పరీక్షలు నిర్వహించగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో గురువారం ఎవరూ చేరలేదు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారు. 316బెడ్లు ఖాళీగా ఉన్నాయి.