పారదర్శకంగా ఓటరు జాబితా
ABN , First Publish Date - 2022-11-28T00:33:51+05:30 IST
ఓటరు జాబితాను వందశాతం పార దర్శకంగా తయారుచేయాలని ఆర్డీవో వెంకటమాధవరావు అన్నారు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 27: ఓటరు జాబితాను వందశాతం పార దర్శకంగా తయారుచేయాలని ఆర్డీవో వెంకటమాధవరావు అన్నారు. ఆది వారం మండలంలోని నిట్టూరులో ఆదివారం 70,71 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఓటరు జాబితాలో నూతన ఓటరు వివ రాలు నమోదు చేసేందుకు అనుసరిస్తున్న విధి, విధానాలను బీఎల్వోల కు వివరించారు. నూతన ఓటరు నమోదుచేసుకున్న దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానికులకు, 18 ఏళ్లు నిండిన అర్హులకు మాత్రమే చోటు కల్పించాలని సూచించారు. వారి వెంట పెద్దపల్లి డిప్యూటీ తహసీ ల్దార్ విజేందర్, బీఎల్వోలు రేణుక, చంద్రయ్యలు ఉన్నారు.