ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు
ABN , First Publish Date - 2022-05-24T05:57:29+05:30 IST
పదోతరగతి పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
- జిల్లాలో 6,381 మంది విద్యార్థులకు 6,341 మంది హాజరు
- 40 మంది విద్యార్థులు గైర్హాజరు
సిరిసిల్ల ఎడ్యుకేషన్, మే 23: పదోతరగతి పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నవిద్యార్థులు 6,381 మంది ఉన్నారు. వీరికోసం జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన పరీక్షలకు 6,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలల్లోకి అనుమతించే ముందు వారిని తనిఖీలు చేసి పంపించారు. దీంతో ఎలకా్ట్రనిక్ గ్యాడ్జెట్స్ ధరించిన విద్యార్థుల చేతి నుంచి వాటిని తొలగించి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జిల్లా పరీక్షల విభాగం అధికారి అబ్దుల్ అజీమ్ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.