క్రీడలు దినచర్యలో భాగం కావాలి

ABN , First Publish Date - 2022-11-28T01:37:11+05:30 IST

ప్రతి విద్యార్థికి దైనందిక జీవితంలో క్రీడ లు దినచర్యలో ఒక భాగం కావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అ న్నారు.

క్రీడలు దినచర్యలో భాగం కావాలి
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత

జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌

జగిత్యాల అర్బన్‌, నవంబరు 27: ప్రతి విద్యార్థికి దైనందిక జీవితంలో క్రీడ లు దినచర్యలో ఒక భాగం కావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్యవైశ్య సంఘ భవనంలో జిల్లా తైక్వాం డో అసోసియేషన్‌ బెల్టుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత హాజరై మాట్లాడుతూ ఆటల వలన మెదడుకు ఉత్తే జం, విశ్లేషణ శక్తి పెరగడంతో పాటు, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. వి ద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపుని చ్చారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గంగారాం, ఉపాధ్యక్షుడు భీమేష్‌, సెక్రటరీ సంతోష్‌, సంఘ అధ్యక్షుడు కృష్ణ, కరాటే మాస్టరక్షౌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:37:13+05:30 IST