ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-10-02T06:31:32+05:30 IST
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు శనివారం చెక్కులను పంపిణీ చేశారు.
- ఎమ్మెల్యే రమేష్బాబు
చందుర్తి, అక్టోబరు 1: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు శనివారం చెక్కులను పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎంపీపీ బైరగొని లావణ్య, తహసీల్దార్ మాజీద్, ప్రజాప్రతినిధులు తిప్పని శ్రీనివాస్, సిరికొండ ప్రేమలత-శ్రీనివాస్, చిలుక అంజిబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.