పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-04-24T17:05:07+05:30 IST
పెద్దకాల్వల శివారులోని రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
పెద్దపల్లి జిల్లా: పెద్దకాల్వల శివారులోని రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం-కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.