‘పల్లె ప్రగతి’ని పకడ్బందీగా అమలుచేయాలి

ABN , First Publish Date - 2022-06-08T05:04:56+05:30 IST

పల్లెప్రగతి కార్యక్రమాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

‘పల్లె ప్రగతి’ని పకడ్బందీగా అమలుచేయాలి
కాల్వశ్రీరాంపూర్‌ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 7: పల్లెప్రగతి కార్యక్రమాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవా రం కాల్వశ్రీరాంపూర్‌, కిష్టంపేట గ్రామాల్లో కలెక్టర్‌ పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద కిష్టంపేట యూపీఎస్‌ పాఠశాల, కాల్వశ్రీరాంపూర్‌ గ్రామంలో చేపట్టిన జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్‌ పెరిగే విధంగా ప్రణాళిక బద్ధంగా పని చేయాలని సూచించారు. కిష్టంపేటలో పచ్చదనం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్‌ పరిశీలించారు. 8వ విడత హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు. కిష్టంపేటలో నిర్మించిన పల్లె ప్రకృతివనం పరిశీలించి, మొక్కల సంరక్షణకు తీసుకున్నందుకు గ్రామ సర్పంచ్‌ తిరుపతిరెడ్డిని అభినందించారు. ప్రతి ఇంటివద్ద తడి చెత్త పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే గ్రామంలో ఏర్పాటు చేసిన సేగ్రిగేషన్‌ షెడ్డు వినియోగించాలని కలెక్టర్‌ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్‌ నిర్మించిన శ్మశానవాటిక పరిశీలించిన కలెక్టర్‌, విద్యుత్‌ సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు తయారుచేయాలని ట్రాన్స్కో అధికారలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూ నెటి సంపత్‌ యాదవ్‌, జడ్పిటీసీ వంగల తిరుపతిరెడ్డి మండల ప్ర త్యేక అధికారి ఆదిరెడ్డి, తహసిల్దార్‌ సునీత, ఎంపీడీవో రామ్మోహన్‌ చారి, ఎంఈఓ రాజయ్య, సర్పంచ్‌లు శ్రీదేవి రాజు, కాసర్ల తిరుపతి రెడ్డి, సంబంధిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-08T05:04:56+05:30 IST