తల్లులకు నీరా‘జనం’

ABN , First Publish Date - 2022-02-19T05:55:20+05:30 IST

వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మల దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు.

తల్లులకు నీరా‘జనం’
గోదావరిఖనిలో బెల్లం ఎత్తుకుని వస్తున్న ఎమ్మెల్యే చందర్‌

- సమ్మక్క, సారలమ్మల దర్శనానికి పోటెత్తిన భక్తులు

- నేడు దేవతల వనప్రవేశంతో ముగియనున్న జాతర

(అంద్రజ్యోతి, పెద్దపల్లి)

వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మల దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి జాతరకు విచ్చేసిన భక్తు లు ఆ దేవతలకు నీరాజనాలు అర్పించారు. గురువారం రాత్రి జిల్లాలో గల గోలివాడ గోదావరిఖని, నీరుకుళ్ళ, కొలనూర్‌, మడక, హను మం తునిపేట, తుర్కలమద్దికుంట, దొంగతుర్తి, ధర్మారం, తేలికుంట, గుండా రం, మీర్జంపేట, మైదంబండ, గర్రెపల్లి తదితర ప్రాంతాల్లో జరుగుతు న్న సమ్మక్క, సారలమ్మ జాతరకు పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. ఈనెల 16వ తేదీన జాతర ప్రారంభం కాగా శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో ముగియనున్నది. ఇద్దరు దేవతలను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటిల్లిపాదిని చల్ల గా చూడాలని భక్తులు సమ్మక్క, సారలమ్మలను వేడుకున్నారు. భక్తు లు నిలువెత్తు బంగారం ఇవ్వడంతోపాటు కొందరు తలనీలాలు సమ ర్పించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-02-19T05:55:20+05:30 IST