ఆలయాలకు కార్తీక శోభ
ABN , First Publish Date - 2022-11-08T00:22:50+05:30 IST
కార్తీక పౌర్ణమి, రెండో సోమవారం సందర్భంగా ఆలయాల్లో శివకేశవులకు విశేష అభిషేక, అలంకారాలు, అర్చనలు చేశారు.
కరీంనగర్ కల్చరల్, నవంబరు 7: కార్తీక పౌర్ణమి, రెండో సోమవారం సందర్భంగా ఆలయాల్లో శివకేశవులకు విశేష అభిషేక, అలంకారాలు, అర్చనలు చేశారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సోమవారమే భక్తులు ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు, నదీతీర ప్రాంతాలకు వెళ్లి పవిత్ర స్నానాలు, దానధర్మాలాచరించి పూజలు చేశారు. ఇళ్ళలో, ఆలయాల్లో దీపాలు, ఆకాశదీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.
చొప్పదండి: పట్టణంలోని శివకేశ ఆలయంలో కార్తీక దిపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని 1008 దీపాలతో అలంకరించారు.
Read more