కొత్తపల్లిలో రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-11-12T00:44:37+05:30 IST
గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో శుక్రవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం తూకంలో మోసం జరుగుతోందని ఆరోపించారు. 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని వాపోయారు.
గంభీరావుపేట, నవంబరు 11 : గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో శుక్రవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం తూకంలో మోసం జరుగుతోందని ఆరోపించారు. 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని వాపోయారు. స్థానిక తహసీల్దార్ మధుసూదన్రెడ్డి అక్కడి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. 41 కిలోలు తూకం వేసేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
ముస్తాబాద్ : మండలంలోని కొండాపూర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు ధర్నా చేశారు. కొండాపూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం నడుస్తోందని, వడ్లను జాలి పట్టకుండా 42.300 తూకం వేయాలని నిర్ణయించారని మళ్లీ పొల్లు పట్టాలని సిబ్బంది తెలుపడంతో రైతులు ఆందోళనకు దిగారు. బీజేపీ గ్రామ అధ్యక్షుడు చిగురు వెంకన్న, గుడికందుల మహేందర్రెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు క్యారం రాజు తదితరులు పాల్గొన్నారు.