దళితబంధు పథకం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-30T04:57:45+05:30 IST

దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపె ట్టి దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

దళితబంధు పథకం దేశానికే ఆదర్శం
మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌

- ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌

గోదావరిఖని, సెప్టెంబరు 29: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపె ట్టి దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గురువారం సాయం త్రం పట్టణంలో దళిత బంధు యూనిట్లను సందర్శించా రు. జిల్లాలో త్వరగా యూనిట్లను గ్రౌండింగ్‌ చేయడంలో చొరవచూపిన అధికారులను బండ శ్రీనివాస్‌ అభినందిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులందరికి దళిత బంధు పథకాన్ని వర్తింప చేసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా దళిత, బహుజనులంతా ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, జాతీయ రాజకీ యాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టీసీ ఆముల నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T04:57:45+05:30 IST