రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-12-13T00:48:31+05:30 IST

వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో రద్దీగా మారిపోయింది. తమ ఇష్టదైవమైన శ్రీరాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వేము లవాడకు తరలివచ్చారు.

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
రాజన్న సన్నిధిలో భక్తుల పవిత్ర స్నానాలు

వేములవాడ, డిసెంబరు 12: వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో రద్దీగా మారిపోయింది. తమ ఇష్టదైవమైన శ్రీరాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వేము లవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని ఆదిదేవుడు శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీస్వామివారి గర్భాలయంలో రుద్రాభిషేకం, అన్నపూజ, కళాభ వన్‌లో శ్రీస్వామివారి నిత్యకళ్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి ఆలయం లో కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. శ్రీస్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.సుమారు 15 వేలకు పైగా భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భం గా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-12-13T00:48:33+05:30 IST