రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-12-10T00:34:17+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
స్వామివారి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు

వేములవాడ, డిసెంబరు 9: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అభిషేక పూజ, అన్నపూజ, స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-12-10T00:34:36+05:30 IST