జీప్యాట్, నైపర్ ర్యాంకర్లకు నగదు పురస్కారం
ABN , First Publish Date - 2022-09-08T07:23:00+05:30 IST
శాతవాహన విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలో బీఫార్మసీ చదివి జీప్యాట్, నైపర్ పరీక్షల్లో 500లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం తరపున వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్ బుధవారం నగదు పురస్కారాలను అందజేశారు.
గణేశ్నగర్, సెప్టెంబరు 7: శాతవాహన విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలో బీఫార్మసీ చదివి జీప్యాట్, నైపర్ పరీక్షల్లో 500లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం తరపున వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్ బుధవారం నగదు పురస్కారాలను అందజేశారు. 2018-22 బ్యాచ్కు చెందిన బీ ఫార్మసీ విద్యార్థులు కె లాస్యప్రియ, బి సౌమ్య భవానీ, కె లక్ష్మీనాగ సంధ్య, డి రాజ్యలక్ష్మి, బి భావన ఒక్కొక్కరికికి 10 వేల రూపాయల చొప్పున నగదు రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నామన్నారు. రాబోయే బ్యాచ్ల విద్యార్థులు మరింత కష్టపడి ఉత్తమ ర్యాంకులు సాధించాలని, విశ్వవిద్యాలయానికి పేరుకు తీసుకురాన్నారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్ ప్రొఫెసర్ ఎం వరప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ర్టార్ వై కిషోర్, ప్రిన్సిపాల్ డాక్టర్ బి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.