నూతన కలెక్టరేట్లోనే కార్యకలాపాలు
ABN , First Publish Date - 2022-12-10T00:36:06+05:30 IST
పట్టణంలో ఇటీవల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనంలో ఇ క నుంచి ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు నిర్వహించాలని కలెక్టర్ గుగులో తు రవి నాయక్ అధికారులను ఆదేశించారు.
- జిల్లా కలెక్టర్ గుగులోతు రవి నాయక్
జగిత్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఇటీవల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనంలో ఇ క నుంచి ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు నిర్వహించాలని కలెక్టర్ గుగులో తు రవి నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధి కారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ రవి నాయక్ మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే వేదికగా ప్రజలకు సులభం గా, వేగంగా సేవలు అందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో సమీకృత కలెక్టరేట్ ని ర్మించినందున ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన గదులకు పాత కార్యా లయాల నుండి సామగ్రి, ఫైళ్లను వెంటనే తరలించాలని చెప్పారు. టీ-ఫైబర్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని అధికారు లను ఆదేశించారు. స్టోర్ రూంల కోసం అదనంగా గదులు కావాలనుకుంటే కా ర్యాలయ బయట ఉన్న ప్రభుత్వ భవనాలలో గదులను కేటాయిస్తామని స్ప ష్టం చేశారు. వచ్చే ప్రజావాణి కార్యక్రమాన్ని సైతం నూతన సమీకృత కలె క్టరేట్లోనే నిర్వహిస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలె క్టర్లు బీఎస్ లత, మంద మకరందు, అధికారులు పాల్గొన్నారు.