TS News: కేఏ పాల్ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-12-06T21:54:06+05:30 IST

Hyderabad: అంబేడ్కర్‌ వాదాన్ని నిలబెట్టడం కోసం కేసీఆర్ సహా.. అందరు ముఖ్యమంత్రులు కలసి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ

TS News: కేఏ పాల్ విజ్ఞప్తి

Hyderabad: అంబేడ్కర్‌ వాదాన్ని నిలబెట్టడం కోసం కేసీఆర్ సహా.. అందరు ముఖ్యమంత్రులు కలసి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌ పేరు లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రూ.3,600కోట్లతో పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎవరూ ప్రశ్నించకపోవడం దారుణమని పేర్కొన్నారు. దేశంలో దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలకు ఓటు లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

Updated Date - 2022-12-06T21:54:07+05:30 IST