నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు

ABN , First Publish Date - 2022-04-24T16:33:26+05:30 IST

ప్రాణహిత పుష్కరాలు తుది అంకానికి చేరాయి. ఆదివారంతో ముగియనున్నాయి.

నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు

జయశంకర్ భూపాలపల్లి: ప్రాణహిత పుష్కరాలు తుది అంకానికి చేరాయి. ఆదివారంతో ముగియనున్నాయి. చివరిరోజు కావడంతో ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు ఘాట్లకు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.


12 రోజులుగా పుష్కరాలు సాగుతున్నాయి.. వేకువ జామున నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 

Updated Date - 2022-04-24T16:33:26+05:30 IST