HCA: టికెట్ల విక్రయాల్లో అవకతవకలు
ABN , First Publish Date - 2022-09-29T14:29:28+05:30 IST
ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని రావినూతల శ్రీధర్ సీసీఎ్సలో
హెచ్సీఏపై సీసీఎస్లో మరో ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని రావినూతల శ్రీధర్ సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. టికెట్ల విక్రయాల సందర్భంగా ఈ నెల 22న జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాటకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియంలో 55వేల సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ.. 38వేల టికెట్లు మాత్రమే విక్రయించారని బేగంపేట్ పీఎ్సలో మరో ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. దీంతో హెచ్సీఏపై మొత్తం 4 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.