స్వదేశీ వ్యాక్సిన్ దేశానికి గర్వకారణం: తమిళిసై
ABN , First Publish Date - 2022-04-05T08:18:21+05:30 IST
స్వదేశీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం ద్వారా మన శాస్త్రవేత్తలు కోట్లాది మంది ప్రాణాలు కాపాడి దేశం గర్వించేలా చేశారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 4: స్వదేశీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం ద్వారా మన శాస్త్రవేత్తలు కోట్లాది మంది ప్రాణాలు కాపాడి దేశం గర్వించేలా చేశారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్ భవన్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ మీడియా ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో గవర్నర్ మాట్లాడారు. దేశ ప్రజలందరికీ టీకాలు ఇచ్చేంత వరకు వ్యాక్సినేషన్ కొనసాగించాల్సి ఉం దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం, గిరిజనుల విద్య.. గవర్నర్గా తన ప్రాధాన్య అంశాలని వెల్లడించారు.