India - Australia match టికెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్... తొక్కిసలాట

ABN , First Publish Date - 2022-09-22T17:35:29+05:30 IST

భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఎగబడటంతో జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది.

India - Australia match టికెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్... తొక్కిసలాట

సికింద్రాబాద్‌: భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ (India - Australia match) టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు (Cricket fans) ఎగబడటంతో జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు అభిమానులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్యూ కట్టారు. టికెట్ల కోసం పెద్దఎత్తున క్రికెట్‌ అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దీంతో అభిమానులను పోలీసులు నియంత్రించలేని పరిస్థితి. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అలాగే పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది.


కాగా భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో మూడు వేలు మాత్రమే ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్స్‌కు తరలివచ్చారు. దాదాపు 30వేల మందికిపైగా అభిమానులు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంచనాలకు మించిన క్రికెట్ అభిమానులు తరలిరావడంతో... తొక్కిసలాట జరుగగా... చివరకు పోలీసులు వారిని అదుపుచేసేందుకు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-09-22T17:35:29+05:30 IST