TS News: డబ్బులిస్తే తీసుకోండి.. కాని ఓటు మాత్రం ఆ పార్టీకే వేయండి: షర్మిల

ABN , First Publish Date - 2022-09-24T23:37:34+05:30 IST

Sangareddy: ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండి.. కాని ఓటు మాత్రం మీ భవిష్యత్ కోసం ఆరాట పడే పార్టీకే వేయండని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు (YSRTP) షర్మిల (Sharmila) అన్నారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ‘‘ఐదేళ్ల పాలనలో వైఎస్సార్ ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజల అవసరాలు దృష్టి

TS News: డబ్బులిస్తే తీసుకోండి.. కాని ఓటు మాత్రం ఆ పార్టీకే వేయండి: షర్మిల

Sangareddy: ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండి.. కాని ఓటు మాత్రం మీ భవిష్యత్ కోసం ఆరాట పడే పార్టీకే వేయండని వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) అన్నారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ‘‘ఐదేళ్ల పాలనలో వైఎస్సార్ ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని పథకాల రూప కల్పన చేశారు. అందుకే ప్రతి పథకం ప్రజల గుండెల్లో నిలిచి పోయింది. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే .. ఆ డబ్బును ప్రభుత్వమే భరించింది. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్. మళ్లీ వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా. మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీద పెడతా. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తా. ఇంట్లో వృద్దులందరికీ పింఛన్ మంజూరు చేస్తా. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తోనే సంక్షేమ పాలన సాధ్యం’’ అని షర్మిల పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-24T23:37:34+05:30 IST