Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం
ABN , First Publish Date - 2022-09-10T12:58:01+05:30 IST
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం అయిన సంఘటన హయత్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన
హైదరాబాద్/అబ్దుల్లాపూర్మెట్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం అయిన సంఘటన హయత్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్కు చెందిన తిరమదాస్ ప్రసాద్కు నాగోల్కు చెందిన పూజతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అన్విత, రిషిక్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. 13 రోజుల క్రితం భార్య, భర్తకు చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో ఆమె పిల్లల తో కలిసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఐదు రోజుల క్రితం తిరిగి భార్య పిల్లల ను కుంట్లూర్లోని తన ఇంటికి తీసుకువచ్చాడు. కాగా శుక్రవారం ఉదయం 10గంటల సమయంలో నాగోల్లోని తల్లి వద్దకు వెళ్తున్నానని ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. ఇంటి నుంచి వెళ్లిన అరగంట తర్వాత తనతో ఉండలేనని ఫోన్లో వాయిస్ మెసెజ్ పంపించింది. తన కోసం వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని మెసెజ్ చేసిందని ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.