road accident: అతివేగం... ఆయువు తీసింది
ABN , First Publish Date - 2022-11-28T10:48:13+05:30 IST
అతి వేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొనగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఇద్దరు యువకులు బైక్పై
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి గాయాలు
హైదరాబాద్/ఏఎస్.రావునగర్: అతి వేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొనగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఇద్దరు యువకులు బైక్పై ఈసీఐఎల్ చౌరస్తా నుంచి రాధిక చౌరస్తా వైపు వేగంగా వెళుతూ డివైడర్ను ఢీకొట్టారు. బైక్ నడుపుతున్న యువకుడు రోడ్డుపై పడితీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, వెనక కూర్చున్న యువకుడు డివైడర్పై పడడంతో గాయాలయ్యాయి. మృతుడు మారుతీనగర్లో నివసించే గోపాలకృష్ణరాజు చిన్న కుమారుడు దంతులూరి అభిసాయిరాం రాజు (22)గా, గాయపడ్డ యువకుడు సాయిరాం స్నేహితుడు, సిద్ధిపేటకు చెందిన రమేష్ (25)గా పోలీసులు గుర్తించారు. అభిసాయిరాం ఇటీవలే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. అభిసాయిరాం శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, ఆదివారం ఉదయం మృతి చెందినట్టు తెలిసిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంలో గాయపడ్డ రమేష్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బి.వేణుమాధవ్ తెలిపారు.