Yadagirigutta Lakshminarasimhaswamy: యాదగిరిగుట్టకు రూ1.16 కోట్ల ఆదాయం
ABN , First Publish Date - 2022-11-21T04:12:34+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు మరోసారి రికార్డు స్థాయిలో నిత్యాదాయం సమకూరింది.
నృసింహుడి దర్శనానికి 60 వేల మంది
యాదగిరిగుట్ట/బీబీనగర్, నవంబరు 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు మరోసారి రికార్డు స్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆదివారం నృసింహుడిని 60 వేల మందికిగా పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటంతో రూ.1,16,13,977 ఆదాయం వచ్చిందని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. దర్శన టికెట్ల నుంచి రూ.18.90 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.44.37 లక్షలు, కొండ పైకి వచ్చిన వాహనాల ద్వారా రూ.9.75 లక్షలు, తలనీలాల ద్వారా రూ.1.78 లక్షల ఆదాయం ఖజానాకు చేరాయని ఈవో వెల్లడించారు. ఒక్కరోజే రూ.కోటిపైగా ఆదాయం సమకూరటం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. గత ఆదివారం ఆలయ ఖజానాకు రూ.కోటికు పైగా నిత్యాదాయం సమకూరింది.