ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నేటి నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-12-10T03:15:27+05:30 IST

ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నేటి నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి అయింది. మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్‌ అప్‌ రౌండ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. విద్యార్థులు శనివారం నుంచి 12వ తేదీ వరకు వెబ్‌ ఆఫ్షన్లును నమోదు చేసుకోవాలి. ఇతర సమాచార వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని నోటిఫికేషన్‌లో కోరారు. అలాగే, ఆలిండియా కోటా బీహెచ్‌ఎంఎ్‌స సీట్ల భర్తీకి వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated Date - 2022-12-10T03:15:28+05:30 IST