జూన్‌-1న Hyderabadలోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

ABN , First Publish Date - 2022-05-30T14:38:05+05:30 IST

జూన్‌ ఒకటో తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో (Water Supply) అంతరాయం తలెత్తనున్నట్లు

జూన్‌-1న Hyderabadలోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

హైదరాబాద్‌ సిటీ : జూన్‌ ఒకటో తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో (Water Supply) అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్‌బోర్డు (Water Board)అధికారులు తెలిపారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్‌-3కి చెందిన పైపులైను మరమ్మతు పనులను చేపట్టనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. దీంతో గండిపేట, నార్సింగి, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ, చందానగర్‌, హుడా కాలనీ, బీహెచ్‌ఈఎల్‌ ఎల్‌ఐజీ, తారానగర్‌, గంగారం, లింగంపల్లి రాజీవ్‌ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, గోపన్‌పల్లి, గుల్మొహర్‌ పార్కు, నేతాజీనగర్‌, నెహ్రూనగర్‌, తెల్లాపూర్‌, వట్టినాగులపల్లి, చింతలబస్తీ, విజయనగర్‌ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం తలెత్తనుంది.

Updated Date - 2022-05-30T14:38:05+05:30 IST