TS News: పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టిఆర్ఎస్‌కు బీజేపీ చెక్..

ABN , First Publish Date - 2022-10-06T20:16:26+05:30 IST

ఢిల్లీ (Delhi): పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్‌ (TRS)కు బీజేపీ (BJP) చెక్ పెట్టింది.

TS News: పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టిఆర్ఎస్‌కు బీజేపీ చెక్..

ఢిల్లీ (Delhi): పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్‌ (TRS)కు బీజేపీ (BJP) చెక్ పెట్టింది. కేశవరావు (Keshavarao), నామా నాగేశ్వరావు (Nama Nageswararao)ల ఛైర్మన్ పదవులు గల్లంతయ్యాయి. పరిశ్రమలశాఖ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కేశవరావు.. ఇక ఆ కమిటీలో సభ్యునిగా మాత్రమే కొనసాగనున్నారు. లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నామాను ఆ కమిటీలో సభ్యునిగా గుర్తించనున్నారు. 16మంది ఎంపీలున్న టిఆర్ఎస్‌కు స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి దక్కలేదు. దాంతో టీఆర్ఎస్ ఎంపీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టిఆర్ఎస్ బిఆర్ఆస్‌గా మారినందునే బీజేపీ తమ పట్ల వివక్ష చూపుతోందని టిఆర్ఎస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-10-06T20:16:26+05:30 IST