వృద్ధులకు బంజారా మహిళా యన్.జీ.వో అన్నదానం
ABN , First Publish Date - 2022-11-30T19:40:19+05:30 IST
బంజారా మహిళా యన్.జీ.వో ఫౌండర్ డా.ఆనంద్, హరి ప్రియా రెడ్డి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
హైదరాబాద్: బంజారా మహిళా యన్.జీ.వో ఫౌండర్ డా.ఆనంద్, హరి ప్రియా రెడ్డి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సంయుక్తంగా హైదరాబాదులోని నాగోల్ ప్రాంతంలో ఉన్న వృద్ధాశ్రమంలో దాదాపు వందమంది వృద్ధులకు ప్రత్యేక భోజన వసతిని కల్పించారు. డా.ఆనంద్ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో భాగంగా తన, మిత్ర బృందంతో పలుచోట్ల ఉచిత శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.