సంచార జాతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-07-18T05:59:11+05:30 IST
సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర
అబ్దుల్లాపూర్మెట్, జూలై 17(ఆంధ్రజ్యోతి): సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని జాతీయ సంచార విముక్త జాతుల కమిషన్ మాజీ చైర్మన్ బాలకృష్ణ రెంకే అన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్మెట్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతం త్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా సంచార జాతుల స్థితిగతుల్లో ప్రభుత్వాలు ఏలాంటి మార్పులు తీసుకురాలేదన్నారు. నేటికి ఇళ్లు లేక గుడిసెలు వేసుకుని గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజ్యాంగ బద్ధ్దమైన కులాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 100 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసి ఆర్థిక అభివృద్ధ్దికి పాటు పాడాలని కోరారు. కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్, పల్లవి రాంకే, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్రవికుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నీరు నాగేశ్వర్రావు పాల్గొన్నారు.