ఉద్యోగుల కోసం ఆర్టీసీ ’గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’
ABN , First Publish Date - 2022-11-03T05:22:15+05:30 IST
ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టిసారించిన టీఎ్సఆర్టీసీ యాజమాన్యం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ పేరిట ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించనుంది.
నేడు ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టిసారించిన టీఎ్సఆర్టీసీ యాజమాన్యం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ పేరిట ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా సంస్థలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ’హెల్త్ ప్రొఫైల్’ రూపొందించనుంది. నవంబరు 3 నుంచి ప్రారంభమయ్యే ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ పోస్టర్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బుధవారం బస్భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఆరోగ్యపరంగా సరిగ్గా ఉంటేనే సంస్థ ఆర్థికంగా పురోగతి సాధిస్తుందన్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ డీఎంలు, రీజియన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కృషి చేయాలని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య రక్షణతోపాటు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందన్నారు. తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రిలో ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ డేటా బేస్లో సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయనున్నట్టు చెప్పారు.