59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
ABN , First Publish Date - 2022-12-30T03:38:45+05:30 IST
‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల టన్నుల ధాన్యాన్ని 10.40 లక్షల మంది రైతుల నుంచి సేకరించాం.
రైతుల ఖాతాల్లో రూ.11వేల కోట్లు జమ: గంగుల
హైదరాబాదు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల టన్నుల ధాన్యాన్ని 10.40 లక్షల మంది రైతుల నుంచి సేకరించాం. వీటి విలువ రూ.12,051 కోట్లు కాగా, ఓపీఎంఎ్సలో నమోదైన రైతుల వివరాల ఆధారంగా ఇప్పటివరకు రూ.11వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 7,011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను 4,607 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తికావడంతో మూసివేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.