3న పని చేయనున్న పాస్పోర్టు సేవా కేంద్రాలు: దాసరి బాలయ్య
ABN , First Publish Date - 2022-11-30T04:11:05+05:30 IST
దరఖాస్తుదారుల సౌకర్యార్థం డిసెంబరు 3న పాస్పోర్టు కేంద్రాలు పని చేస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): దరఖాస్తుదారుల సౌకర్యార్థం డిసెంబరు 3న పాస్పోర్టు కేంద్రాలు పని చేస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని అమీర్పేట్, బేగంపేట్, టోలిచౌకి, కరీంనగర్, నిజామాబాద్ పాస్పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలలో పాస్పోర్టు దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. పాస్పోర్టు దరఖాస్తుల అపాయింట్మెంట్లను రెండు రోజుల ముందు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.