Online cricket betting ముఠా ఆటకట్టు

ABN , First Publish Date - 2022-09-08T17:47:00+05:30 IST

ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తు న్న ముఠా ఆటకట్టించారు రాచకొండ ఎస్‌వో టీ పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Online cricket betting ముఠా ఆటకట్టు

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తు న్న ముఠా ఆటకట్టించారు రాచకొండ ఎస్‌వో టీ పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 20.50 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్‌ హైదరాబాద్‌లో బిల్డర్‌. క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించడంలో ఘనుడు.  అదే జిల్లాకు చెందిన మె యిన్‌ బుకీ గంజి సుబ్బారావు ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఐడీ తీసుకున్నాడు. డబ్బులు వసూ లు చేయడానికి మేడిశెట్టి కిషోర్‌, మహ్మద్‌ ఖదీర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. మంగళవా రం ఇండియా-శ్రీలంక్‌ మ్యాచ్‌పై సరూర్‌నగర్‌ భరత్‌సింగ్‌నగర్‌లో అశోక్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ, సరూర్‌నగర్‌ పోలీసులు దాడిచేశారు. అశోక్‌, కిషోర్‌ను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 1.90 లక్షలు, కారు, ఐదు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 9.63 లక్షలు ఫ్రీజ్‌ చేశారు.

Updated Date - 2022-09-08T17:47:00+05:30 IST