IT Investigation: మంత్రి మల్లారెడ్డి ఐటీ కేసులో కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2022-11-28T13:56:46+05:30 IST

మంత్రి మల్లారెడ్డి ఐటీ కేసులో విచారణ కొనసాగుతున్నాయి.

IT Investigation: మంత్రి మల్లారెడ్డి ఐటీ కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఐటీ కేసులో విచారణ కొనసాగుతున్నాయి. మూడు గంటలుగా నోటీసులు అందుకున్న 11 మందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. రూ.100 కోట్లు రూపాయల డోనేషన్‌పై మల్లా రెడ్డి కుమారుడు భద్రారెడ్డిని ఐటీ విచారిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిమితికి మించి ఫీజులు, భారీగా డొనేషన్లు వసూలు చేశారనే దానిపై మర్రి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మల్లారెడ్డి కళాశాల్లో రూ.100 కోట్లు డోనేషన్‌లు తీసుకున్నట్లు పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నుంచి ఐటీ అధికారులు సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేటాయింపులపై కళాశాల ప్రతినిధులను కూడా ఐటీ ప్రశ్నిస్తోంది. 1994, 2008, 2022లో ఐటీ సోదాలు చేసింది. మల్లారెడ్డి ఇంట్లో దొరికిన రూ.28 లక్షలు నగదు, రాజశేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన రూ.4 కోట్లపై ఆరా తీస్తోంది. సాయంత్రం వరకు 11 మందిని ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు.

Updated Date - 2022-11-28T13:56:47+05:30 IST