Harish rao comments: కేంద్రమంత్రులు తెలంగాణకు చేసిందేమీ లేదు

ABN , First Publish Date - 2022-09-29T16:51:15+05:30 IST

కేంద్రమంత్రులపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చుడు పోవుడు తప్ప, తెలంగాణకు చేసింది ఏం లేదని అన్నారు.

Harish rao comments: కేంద్రమంత్రులు తెలంగాణకు చేసిందేమీ లేదు

హైదరాబాద్: కేంద్రమంత్రుల (Union ministers)పై మంత్రి హరీష్ రావు (Harish rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చుడు పోవుడు తప్ప, తెలంగాణ(Telangana)కు చేసింది ఏం లేదని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఒకడు పాద యాత్ర, ఒకడు సైకిల్ యాత్ర, ఒకడు మోకాళ్ళ యాత్ర అంటడు. ఎవరైనా సమస్యల గురించి మాట్లాడుతున్నారా... సాగు నీళ్ళు లేవని, తాగు నీరు లేదని, కరెంట్ కోతలని ఎవరైనా అడుగుతున్నారా..అలాంటి పరిస్థితులు ఉన్నాయా’’ అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.  గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, సహా అన్ని శాఖల్లో తెలంగాణకు వచ్చిన జాతీయ అవార్డులే మా పాలనకు గీటురాయని మంత్రి హరీష్ రావు (Telangana minister) పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-29T16:51:15+05:30 IST