CM KCR: 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించిన కేసీఆర్

ABN , First Publish Date - 2022-11-15T12:33:24+05:30 IST

రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

CM KCR: 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించిన కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రారంభించారు. మంగళవారం ప్రగతిభవన్‌‌లో వర్చువల్‌గా సీఎం (Telangana CM) క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ(Telangana) చరిత్రలో ఇది కొత్త అధ్యాయమన్నారు. తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా మారుతోందని తెలిపారు. 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. గతంలో 850 సీట్లు ఉండేవి.. ఇప్పుడు 2,790 సీట్లకు పెరిగాయని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. 33 జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలను నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-15T12:33:25+05:30 IST