KCR: ప్రతి నియోజకవర్గంలో దళితబంధు.. ధరణి సమస్యలు రాకుండా చర్యలు

ABN , First Publish Date - 2022-11-15T19:11:45+05:30 IST

పార్టీ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ (Trs) విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr) స్పష్టం చేశారు.

KCR: ప్రతి నియోజకవర్గంలో దళితబంధు.. ధరణి సమస్యలు రాకుండా చర్యలు

హైదరాబాద్: పార్టీ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ (Trs) విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr) స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రులు పాల్గొనాలని కేసీఆర్‌ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నివేదిక రూపొందించుకోవాలని, మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని కేసీఆర్‌ తెలిపారు. 100 ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్‌ను నియమించాలని, 5 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. పోడుభూముల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఇక నుంచి ధరణి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళితబంధు ఇస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-15T19:11:49+05:30 IST