Jeevan Reddy: రైతులు రాజులుగా మారాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి..
ABN , First Publish Date - 2022-09-09T17:09:04+05:30 IST
రైతులు రాజులుగా మారాలంటే సీఎం కేసీఆర్ (CM KCR) దేశ రాజకీయాల్లోకి రావాలని...
హైదరాబాద్ (Hyderabad): రైతులు రాజులుగా మారాలంటే సీఎం కేసీఆర్ (CM KCR) దేశ రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియతో మాట్లాడుతూ దేశానికి గుజరాత్ మోడల్ (Gujarat model) వద్దని, తెలంగాణ మోడల్ (Telangana Model) ముద్దని అన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. తామంతా కేసీఆర్ వెంటే ఉంటామని జీవన్రెడ్డి స్పష్టం చేశారు.
కాగా జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం కేసీఆర్ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో హైదరాబాద్ వేదికగా ఆయన జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. ఈనెల 11న హైదరాబాద్కు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి (Kumaraswamy) వస్తున్నారు. సీఎం కేసీఆర్తో ఆయన సమావేశమవుతారు. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాతే ఫ్రంట్లు.. పొత్తులు ఉంటాయని, ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తున్నారు.