TS News.. హైదరాబాద్: పాతబస్తీలొ ప్రశాంత వాతావరణం
ABN , First Publish Date - 2022-08-25T15:47:09+05:30 IST
నిరసనల హోరుతో చెలరేగిన పాతబస్తీ (Old city)లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) వ్యాఖ్యలతో నిరసనల హోరుతో చెలరేగిన పాతబస్తీ (Old city)లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు తగ్గాయి. చార్మినార్ (Charminar) వద్ద షాపులు తెరుచుకున్నాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్తో భద్రత ఏర్పాటు చేశారు. ఓల్డ్ సిటీ వ్యాప్తంగా షాపులు తెరుచుకున్నాయి. అయితే గురువారం కూడా ఓల్డ్ సిటీలో సాయంత్రం నుంచి ఆంక్షలు కొనసాగనున్నాయి.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ అరెస్టయి.. అంతలోనే బెయిల్పై బయటకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం రాజాసింగ్ అరెస్టుతో కాస్త శాంతించిన పరిస్థితి.. మంగళవారం రాత్రి నుంచి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు మంగళవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. రాజాసింగ్కు, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... నల్ల జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్ వ్యవహరిస్తున్నా.. పోలీసులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.