డబ్బు చెల్లించమన్నందుకు చంపేశాడు
ABN , First Publish Date - 2022-12-30T00:15:02+05:30 IST
తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ మహిళను కిరాతకంగా హతమార్చిన వ్యక్తిని, అతడిచ్చిన బంగారాన్ని దాచిన మహిళను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
మహిళ అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
పహాడిషరీఫ్, డిసెంబర్ 29(ఆంధ్రజ్యోతి): తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ మహిళను కిరాతకంగా హతమార్చిన వ్యక్తిని, అతడిచ్చిన బంగారాన్ని దాచిన మహిళను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 74 గ్రా ముల బంగారు నగలు, 1335 గ్రాముల వెండి నగలు, గొడ్డలి, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది హత్య జరిగిన ప్రాంతంలో ఎముకలు, శరీర భాగాలు, బూడి ద స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్, రెడ్డి కాలనీకి చెందిన బొర్రా బాలమ్మ అక్ట్టోబర్ 10న హత్యకు గురైంది. ఆమె కుమారుడు బొర్రా బాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తన ఇంటి పక్కనే ఉంటున్న నెల్లికంటి రాములుపై అనుమానం వ్యక్తం చేశాడు. దర్యాప్తులో భాగంగా డిసెంబర్ 24న రాములును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలమ్మను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బాలమ్మ వద్ద రూ. 10 వేలు అప్పుగా తీసుకున్నానని, డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండ డంతో మల్లాపూర్ గ్రామంవద్ద గొడ్డలితో బాలమ్మ గొంతునరి కి చంపానని, అనంతరం శవాన్ని చిన్న ముక్కలుగా చేసి వరి చెత్తలో కాల్చేశానని, కొన్ని శరీర భాగాలను డ్రైనేజీలో పడేశానని నిందితుడు రాములు తెలిపాడని పోలీసులు పే ర్కొన్నా రు. బాలమ్మ ఒంటిపై నగలు తీసుకొని ముద్దెంగూడెంకు చెందిన మాచనపల్లి లలితకు ఇచ్చి దాయమని సూచించినట్టు కూడా నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు.