TS News: తొక్కిసలాటతో హెచ్సీఏకు సంబంధం లేదు : అజారుద్దీన్
ABN , First Publish Date - 2022-09-23T21:55:53+05:30 IST
Hyderabad: క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కొనుగోలు కోసం జింఖాన్ గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు ఏ సంబంధం లేదని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ (Azaruddin) అన్నారు. తాను ఏ తప్పూ చేయలే
Hyderabad: క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కొనుగోలు కోసం జింఖాన్ గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు ఏ సంబంధం లేదని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ (Azaruddin) అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తొక్కిసలాటలో తన తప్పుంటే అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. ‘‘అన్నీ సజావుగా నిర్వహిస్తున్నాం. టికెట్ల విక్రయాల్లో హెచ్సీఏ నుంచి ఏ పొరపాటు జరగలేదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకోలేదు. అలా అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. కాంప్లిమెంటరీ పాసులు ఎవరికి ఇవ్వలేదు. డైరెక్ట్ కార్పొరేట్ టికెట్లు 6వేల దాకా ఉన్నాయి. 11,500 టికెట్లు ఆన్లైన్లో విక్రయించాం. జింఖానా దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసు. ఆ బాధ్యత అంతా వారే చూసుకోవాలి. గాయపడిన వారికి వైద్య ఖర్చులు మేం భరిస్తాం. సుప్రీంకోర్టు కమిటీకి మేం జవాబుదారులం’’ అని అజారుద్దీన్ పేర్కొన్నారు.