కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ABN , First Publish Date - 2022-11-28T12:58:36+05:30 IST

కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసింది.

కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

Hyderabad : కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలిసిందే. దాదాపు నిర్మాణం పూర్తై పోయినట్టే. ఈ క్రమంలోనే ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం డేట్, టైమ్ ఫిక్స్ చేసింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించనుంది. ఆ రోజు నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముందుగా 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి తన ఛాంబర్లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

Updated Date - 2022-11-28T12:58:38+05:30 IST