నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-30T00:11:15+05:30 IST

ఎల్బీనగర్‌ నియోజక వర్గ అభివృద్ధే నా లక్ష్యం అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి అన్నారు.

నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యం

వనస్థలిపురం, డిసెంబర్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎల్బీనగర్‌ నియోజక వర్గ అభివృద్ధే నా లక్ష్యం అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి అన్నారు. గురు వారం వనస్థలిపురం డివిజన పరిధిలోని క్రిస్టియన కాలనీలో రూ.2కోట్ల 75 లక్షలతో స్ర్టామ్‌ వాటర్‌ డ్రైన్ల పనులు, శ్రీకృష్ణనగర్‌ కాలనీలో రూ.42.30లక్షలతో సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్‌ వెంకటేశ్వరరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యమని అన్నారు. అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్యకమ్రంలో మాజీ కార్పొరేటర్‌ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, క్రిస్టియన కాలనీ అధ్యక్షుడు హరిందర్‌ రెడ్డి, శ్రీకృష్ణనగర్‌ కాలనీ అధ్యక్షుడు కుట్ల నర్సింహయాదవ్‌, ఉపాధ్యక్షుడు బోయపల్లి రాములుగౌడ్‌, నాగిళ్ల వెంకటేశ, చింతల రవికుమార్‌, నూతి శ్రీనివాస్‌, నాయకులు లగ్గోని శ్రీధర్‌గౌడ్‌, గడల రాజునాయి, లతాఆనంద్‌ రాజ్‌, చాపల శ్రీనివాస్‌యాదవ్‌, ఖైసర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:11:17+05:30 IST