Hyderabad City: రౌడీషీటర్ మేళా 47మందిపై కేసులు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-11-11T12:09:27+05:30 IST
సత్ప్రవర్తన కలిగి ఉన్న 47మంది రౌడీషీటర్లపై పోలీసు ఉన్నతాధికారులు రౌడీషీట్ కేసులు
సత్ప్రవర్తన ఉంటే మిగిలిన వారిపై కూడా..
హైదరాబాద్ సిటీ: సత్ప్రవర్తన కలిగి ఉన్న 47మంది రౌడీషీటర్లపై పోలీసు ఉన్నతాధికారులు రౌడీషీట్ కేసులు ఎత్తివేశారు. కార్ హెడ్క్వార్టర్లో గురువారం రౌడీషీటర్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తితో కలిసి సౌత్జోన్ డీసీపీ సాయిచైతన్య నగరంలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పదేళ్లుగా ఎలాంటి గొడవల జోలికి వెళ్లకుండా జీవనం సాగిస్తున్న 35 మంది రౌడీషీటర్లకు, 60 ఏళ్ల పైబడి, గడిచిన ఐదేళ్లుగా ఎలాంటి కేసులు నమోదుకాని ఐదుగురికి, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న మరో 9 మందిపై రౌడీషీట్ను ఎత్తివేసినట్లు తెలిపారు. గతంలో నేరాలు చేసి రౌడీషీట్లుగా నమోదు అయినవారు, కొంతకాలంగా ఎలాంటి నేరాలు చేయకుండా సత్ప్రవర్తనతో మెలిగినవారిపై రౌడీషీట్ ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆమె అన్నారు.