BJP Chief: నేడు లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించనున్న బండి సంజయ్

ABN , First Publish Date - 2022-11-28T14:05:27+05:30 IST

హైకోర్టు ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈరోజు లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించనున్నారు.

BJP Chief:  నేడు లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించనున్న బండి సంజయ్

హైదరాబాద్: హైకోర్టు (Telangana Highcourt) ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay) ఈరోజు లాంఛనంగా పాదయాత్ర (Padayatra)ను ప్రారంభించనున్నారు. మరికాసేపట్లో కరీంనగర్ నుంచి నిర్మల్‌కు బీజేపీ నేత బయలుదేరి వెళ్లనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లి...అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులతో అక్కడి నుంచే బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రేపు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బైంసాలోకి బండి సంజయ్ ప్రవేశించడానికి వీల్లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్వర్వులను గౌరవిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను రూపొందించే పనిలో పడింది.

Updated Date - 2022-11-28T14:05:29+05:30 IST