బీఆర్‌ఎస్‌తో కేసీఆర్‌ మరో ప్రస్థానం

ABN , First Publish Date - 2022-12-10T02:56:17+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో కేసీఆర్‌ మరో ప్రస్థానం మొదలైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర, సమ్మిళిత, అభివృద్థి, సంక్షేమం ....

బీఆర్‌ఎస్‌తో కేసీఆర్‌ మరో ప్రస్థానం

తెలంగాణ భూమిక, భారతావని వేదిక: ఎమ్మెల్సీ కవిత

నవ శకం.. లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌ రావు

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో కేసీఆర్‌ మరో ప్రస్థానం మొదలైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర, సమ్మిళిత, అభివృద్థి, సంక్షేమం ధ్యేయంగా ఈ ప్రస్థానం సాగుతుందన్నారు. జై తెలంగాణ.. జై భారత్‌.. జై బీఆర్‌ఎస్‌.. జై కేసీఆర్‌ అంటూ కవిత ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చరిత్రాత్మకమని.. దీంతో నవశకం ఆరంభమైందని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. 70 శాతం ప్రజలు వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్న దేశంలో వారి కన్నీళ్లు తుడిచేందుకు అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

Updated Date - 2022-12-10T02:56:29+05:30 IST