ఉన్నత విద్యలో అంబేడ్కర్ వర్సిటీ మార్గదర్శి :న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ.వీఎ్స.ప్రసాద్
ABN , First Publish Date - 2022-12-10T00:33:00+05:30 IST
ఉన్నత విద్యా వ్యాప్తికి డా.బీఆర్ అంబేడ్కర్ సూచించిన మార్గం ఎంచుకొని ముందుకు నడవాల్సిన అవసరముందని న్యాక్ మాజీ డైరెక్టర్, డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.వీఎ్స.ప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఉన్నత విద్యా వ్యాప్తికి డా.బీఆర్ అంబేడ్కర్ సూచించిన మార్గం ఎంచుకొని ముందుకు నడవాల్సిన అవసరముందని న్యాక్ మాజీ డైరెక్టర్, డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.వీఎ్స.ప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. దూరవిద్యా పితామహుడు ప్రొ.జి.రాంరెడ్డి జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ‘‘నాలుగు దశాబ్దాల భారతదేశపు మొదటి ఓపెన్ యూనివర్సిటీ గతానుభవాలు, భవిష్యత్ ప్రయాణం’’ అనే అంశంపై స్మార కోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రొ.ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో దూరవిద్య విధానాన్ని ప్రారంభించే క్రమంలో వచ్చిన ఇబ్బందులను ప్రొ.రాంరెడ్డి ధీటుగా ఎదుర్కొని ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు సేవలను మరింత విస్తృతం చేయాలని, నాణ్యమైన ఉన్నత విద్యను పేదలకు అందించాల్సిన అవసరముందన్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.సీతారామరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రొ.జి.రాంరెడ్డి దూరదృష్టి, ఉన్నత విద్యా వ్యాప్తికి ఆయన చిత్తశుద్ధి ఆనుసరణీయం అన్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా స్టడీ మెటీరియల్ ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్ (అకడమిక్) ప్రొ.ఘంటా చక్రపాణి, ప్రొ.జి.రామ్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రొ.జి.హరగోపాల్, ప్రొ.జి.రాంరెడ్డి సతీమణి ప్రమీలా రాంరెడ్డి, కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు ప్రొ.సుధారాణి, ప్రొ.మధుసూదన్ రెడ్డి, ప్రొ.ఆనంద్ పవర్, ప్రొ.వడ్డాణం శ్రీనివాస్, ప్రొ.గుంటి రవి, ప్రొ.పుష్పా చక్రపాణి, డా.ఎల్వీకే రెడ్డి, డా.ఎన్.రజని, విశ్వవిద్యాలయ మాజీ అధ్యాపకులు ప్రొ.వి.వెంకయ్య, మాజీ రిజిస్ర్టార్ ప్రొ.సి. వెంకటయ్య, ప్రొ.ఎ్స.వి.రాజశేఖర్ రెడ్డి, ప్రొ.సుబ్బారావు. డా.సంతో్షరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.