ఎంపీ రాఘురామరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదు

ABN , First Publish Date - 2022-07-06T00:53:20+05:30 IST

పీ రఘురామరాజు (Mp Raghuramaraju)పై కేసు నమోదు అయింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను...

ఎంపీ రాఘురామరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదు

హైదరాబాద్‌ (Hyderabad): ఎంపీ రఘురామరాజు (Mp Raghuramaraju)పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని రఘురామపై ఆరోపణలు వచ్చాయి. రఘురామ కుమారుడు భరత్‌‌తో పాటు ఆయన పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  A1గా రఘురామరాజు, A2గా భరత్, A3 సందీప్‌(సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్), A4 ఏఎస్సై(సీఆర్పీఎఫ్‌), A5 శాస్త్రి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. 


కాగా జులై 4న ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా రఘురామరాజు జులై 3న సాయంత్రం నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లేందుకు ప్రయత్నించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన రఘురామరాజు.. బేగంపేటలో దిగిపోయారు. అనంతరం ఆయన గచ్చిబౌలిలోని ఇంటికి వెళ్లారు.


అయితే రఘురామ ఇంటి వద్ద జులై 4న ఉదయం ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించి... లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని.. ఆయన్ను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని రఘురామరాజు తెలిపారు. సీసీ టీవీలో వ్యక్తి కదలికలను గుర్తించిన తమ ఇంటి సిబ్బంది.. ఐడీ కార్డు తీసుకుని ఆరా తీస్తే ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పీసీ బాషాగా తేలిందని రఘురామ చెప్పారు. 12 మంది వ్యక్తులు రెండు కార్లలో వచ్చి తన ఇంటి వద్ద కాపు కాశారని... తన వాహనాన్ని వెంబడించారని పోలీస్ అధికారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే ఈ రోజు నర్సాపురం ఎంపీ రఘురామరాజుపై హైదరాబాద్‌ గచ్చిబౌలిలో పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామతో పాటు సీఆర్పీఎఫ్ పోలీసులపై కూడా కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. 


Updated Date - 2022-07-06T00:53:20+05:30 IST