Telangana HighCourt న్యాయవాదులు శిల్ప, దేవేంద్ర అరెస్ట్
ABN , First Publish Date - 2022-06-23T22:59:15+05:30 IST
తెలంగాణ (Telangana) హైకోర్టు (Highcourt) న్యాయవాదులు (Advocates) శిల్ప (Silpa), దేవేంద్ర (Devendra)ను ఎన్ఐఏ (NIA) అధికారులు...
హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana) హైకోర్టు (Highcourt) న్యాయవాదులు (Advocates) శిల్ప (Silpa), దేవేంద్ర (Devendra)ను ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లిద్దర్ని తొలుత అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు. విశాఖ (Vishaka)కు చెందిన నర్సింగ్ విద్యార్థి రాధ (Radha)ను మావోయిస్టు (Maoist)లో చేర్చారని లాయర్లు శిల్ప, దేవేంద్ర, CMSO నాయకురాలు స్వప్న (Swapna)పై అభియోగాలు ఉన్నాయి. 2017లో రాధ మిస్సింగ్ (Missing) అయినట్లు ఆమె తల్లిదండ్రులు విశాఖ పెదబయలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె రాధను శిల్ప, దేవేంద్ర నక్సల్స్లోకి పంపిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు అప్పట్లో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో తాజాగా హైదరాబాద్ ఉప్పల్ చిలకానగర్తో పాటు చేగుంటలో తనిఖీలు నిర్వహించారు. శిల్ప, దేవేంద్ర నివాసాల్లో చేసిన సోదాల్లో సాహిత్య పుస్తకాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం శిల్ప, దేవేంద్ర అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ (Vijayawada)కు తీసుకెళ్తున్నారు. అక్కడి వెళ్లిన తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు.